న్యూఢిల్లీ, జనవరి 19: దేశంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్(హెచ్యూఎల్) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,508 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,481 కోట్ల కంటే ఇది 1.08 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ విక్రయాలు రూ.15,314 కోట్ల నుంచి రూ.15,259 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు రూ.12,305 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీ కన్సాలిడేటెడ్ మొత్తం ఆదాయం రూ.15,781 కోట్లకు చేరుకున్నది.