హైదరాబాద్, అక్టోబర్ 1: దసరా, దీపావళి సందర్భంగా ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్.. కొనుగోలుదారులకు అనేక ఆఫర్లను ప్రకటించింది. 2.5 కిలోల బంగారం, 80 కిలోల వెండితోపాటు 150 సామ్సంగ్ టీవీలు, 600 వెట్ గ్రైండర్లు, 1,375 ఎలక్ట్రిక్ కుక్కర్లు ఇంకా ఎన్నో బహుమతులను అందిస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో ఆర్ఎస్ బ్రదర్స్ వెల్లడించింది. గోల్డెన్ బంపర్ డ్రాల ఫలితాలను దసరా రోజున (బుధవారం), దీపావళి మరుసటి రోజు (26వ తేదీన)ల్లో ప్రకటిస్తామని చెప్పింది. విజేతలకు 25 బంగారు వడ్డాణాలు, 50 వెండి పాత్రలు లభిస్తాయి. కాగా, అతితక్కువగా 3 శాతం తరుగుతో బంగారు ఆభరణాలు, తరుగు-మజూరీ లేని వెండి నగలనూ అమ్ముతున్నట్టు ఆర్ఎస్ బ్రదర్స్ స్పష్టం చేసింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్బ్యాక్ సౌకర్యం కూడా ఉన్నట్టు వివరించింది.