న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో గత రెండేండ్లుగా కుదేలైన పర్యాటక రంగం రానున్న కేంద్ర బడ్జెట్పై భారీ ఆశలు, అంచనాలతో వేచిచూస్తోంది. పలు వైరస్ వేవ్లతో పడిలేస్తున్న పర్యాటక రంగం ప్రభుత్వ ఆసరాను కోరుకుంటోంది. ప్రస్తుత ఒమిక్రాన్ వేవ్ పర్యాటక రంగం పరిస్ధితిని మరింత దుర్భరంగా మార్చివేసిన నేపధ్యంలో రానున్న కేంద్ర బడ్జెట్ వైపు పర్యాటక రంగం భారీ ఆశలు పెట్టుకుంది.
టూరిజం రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్లో పలు ఊరట చర్యలను కోరుకుంటోంది. కరోనా వేవ్లతో కుదేలైన పర్యాటక రంగం నిలకడగా ముందుకు సాగేందుకు బడ్జెట్లో దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని..అంతర్జాతీయ పర్యాటక రంగ పునరుద్ధరణకు బడ్జెట్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నామని ఐక్సిగో సహ వ్యవస్ధాపకులు, గ్రూప్ సీఈఓ అలోక్ బాజ్పేయి పేర్కొన్నారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రస్తుతం థాయ్లాండ్, ఇండోనేషియాలో అమలవుతున్న ప్రోత్సాహకాల తరహాలో కేంద్ర బడ్జెట్లో ఊరట ఇచ్చే చర్యలు ప్రకటించాలని కోరారు.
దేశీ టూరిజం పునరుద్ధరణకు ప్రోత్సాహకాలు, రాయితీలను దేశీ పర్యాటక రంగం కోరుకుంటోంది. దేశీ ట్రావెల్, టూరిజంపై వెచ్చించే మొత్తాలపై ఆదాయ పన్ను డిడక్షన్ ఇవ్వాలని ఇది దేశీ పర్యాటకానికి ఊపుతెస్తుందని ఆయన పేర్కొన్నారు. విమానయాన రంగానికి పన్ను విరామాలు ప్రకటించాలని అలోక్ బాజ్పేయి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పర్యాటక రంగానికి వెన్నుదన్నుగా నిలిచే విమానయాన రంగానికి రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరారు.