న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్..దేశీయ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ రంగంలోకి అడుగుపెట్టడానికి సరికొత్త సిటీని పరిచయం చేసింది. వచ్చే నెలలో అందుబాటులోకి రానున్న ఈ మోడల్ కోసం ముందస్తు బుకింగ్లు ఆరంభించింది కూడా. సెల్ఫ్ చార్జింగ్ కలిగిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ లీటర్కు 26.5 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనున్నది. వీటితోపాటు వైడ్-యాంగిల్ ఫ్రంట్ కెమెరా ఉండంతో ప్రమాదాలు జరగకుండా డ్రైవర్కు అలర్ట్ చేయనున్నది. సెల్ఫ్ చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారు గేమ్ చెంజర్గా నిలువనున్నదని, ప్రత్యేక చార్జింగ్ సదుపాయాలు అవసరం లేదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. భద్రత ప్రమాణాలు మెరుగుపరచడంలో భాగంగా ఈ కారులో కొలిసియన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్(సీఎంబీఎస్), అడాప్టివ్ క్రూజర్ కంట్రోల్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.