Honda Motor Scooters | భారత్లో ఐదు కోట్లకు పైగా బైక్లు, స్కూటర్లను విక్రయించినట్లు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ (హెచ్ఎంఎస్ఐ) తెలిపింది. 2001లో యాక్టివా స్కూటర్తో భారత్లో విక్రయాలు ప్రారంభించినట్లు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తొలి 11 ఏండ్లలో కోటి హోండా యాక్టివా స్కూటర్లు విక్రయించామన్నది. అటుపై మూడు రెట్ల వేగంతో కేవలం మూడేండ్లలోనే రెండు కోట్ల యాక్టివా స్కూటర్లు అమ్మినట్లు తెలిపింది. 16 ఏండ్లలో తొలి 2.5 కోట్ల మంది కస్టమర్లను చేరుకున్నట్లు వివరించింది. తదుపరి ఐదేండ్లలోనే మరో 2.5 కోట్ల వాహనాలు విక్రయించినట్లు వెల్లడించింది.
భారతీయ మొబిలిటీ అవసరాలను తీర్చేందుకు రెండు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్నాం. హోండా బ్రాండ్ను విశ్వసించి ఐదు కోట్ల మంది కస్టమర్లు చూపిన ప్రేమ, నమ్మకాన్ని గౌరవిస్తున్నాం. ఇక ముందు మా కస్టమర్లకు ఉత్తమ నాణ్యతతో కూడిన ఉత్పత్తులతో సేవలందించడంపైనే దృష్టిని కేంద్రీకరించాం అని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ సీఈవో అతుసుషి ఒగాటా పేర్కొన్నారు.
2001లో మనేసర్లోని తొలి మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లో హోండా యాక్టివా స్కూటర్ల ఉత్పత్తి ప్రారంభించింది. 2002 నుంచి విదేశాలకు ఎగుమతులు ప్రారంభించింది. 2004లో 150సీసీ యునికార్న్తో మోటార్ సైకిల్ సెగ్మెంట్లో అడుగు పెట్టినట్లు హెచ్ఎంఎస్ఐ తెలిపింది.