Honda Cars Price Hike | ప్రముఖ జపనీస్ కార్ల తయారీ కంపెనీ హోండా భారత్లో కార్ల ధరలను పెంచబోతున్నది. హోండా సిటీ సెడాన్, అమేజ్ సబ్ కాంపాక్ట్ మోడల్స్ ధరలు పండుగ సీజన్కు ముందు ప్రియం కానున్నాయి. ఉత్పాదక వ్యయాన్ని తగ్గించుకునేందుకు రెండు మోడళ్ల ధరలను పెంచాలని జపనీస్ ఆటో దిగ్గజం భావిస్తున్నది. హోండా ఐదో జనరల్ సిటీ సెడాన్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ను ఈ ఏడాది మార్చిలో రూ.11.49లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. హోండా సిటీ హైబ్రిడ్ వర్షన్ ధర రూ.20.39లక్షల వరకు (Ex Showroom), హోండా సిటీ ప్రస్తుత ప్రారంభ ధర రూ.11.57లక్షలు (Ex Showroom) హోండా అమేజ్ ఎక్స్ షోరూం ధర రూ.7.05లక్షలుగా ఉన్నది.
అయితే, కార్ల ధరలను ఎంత పెంచనున్నది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం కంపెనీ కార్ల ధరల పెంపుపై చర్చిస్తున్నది. హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ( సేల్స్ అండ్ మార్కెటింగ్) కునాల్ బహ్ల్ ఓ వార్త సంస్థతను మాట్లాడుతూ వ్యయాన్ని వీలైనంత వరకు భరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సెప్టెంబర్ నుంచి సిటీ, అమేజ్ ధరలను సవర్తిస్తామన్నారు. ఇదిలా ఉండగా.. బీఎస్6 స్టేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా హోండా 1.5 లీటర్ డీజిల్ యూనిట్ను నిలిపివేసింది.
సెడాన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో రానున్నది. ఇది E20 ఇథనాల్-బ్లెండ్ ఇంధనానికి సపోర్ట్ చేయనున్నది. ఇది గరిష్ఠంగా 121 హెచ్పీ పవర్, 145 ఎన్ఎం గరిష్ఠ టార్క్ను ఉత్పత్తి చేయనున్నది. ఇంజిన్-6 స్పీడ్ మాన్యువల్ లేదంటే సీవీటీ గేర్బాక్స్తో జతచేసింది. 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ హైబ్రిడ్ ఇంజిన్ 126 హెచ్పీ పవర్, 256 Nm గరిష్ఠంగా టార్క్ను ఉత్పత్తి చేయనుండగా.. ఇంజిన్ ఈ-సీవీటీ గేర్బాక్స్తో రానున్నది. ఇదిలా ఉండగా.. హోండా అమేజ్ ఇటీవల భారత్తో పదో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నది. మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరాకు పోటీగా తీసుకువచ్చిన కాంపాక్ట్ సెడాన్ దేశవ్యాప్తంగా 5.3లక్షల విక్రయాలు జరిగాయి.