న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రభుత్వానికి చెందిన ఇంధన విక్రయ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్)తో హోండా మోటర్ జతకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో హెచ్పీసీఎల్కు చెందిన పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకోసం బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఏర్పాటుకానున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే బెంగళూరులోని ఒక హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్లో బ్యాటరీ మార్పిడి స్టేషన్ను ఇటీవల ప్రారంభించారు కూడా. పెట్రోల్, డీజిల్ మాదిరిగా ఈవీ బ్యాటరీలు చార్జింగ్ చేయడం కుదరని, దీంతో బ్యాటరీ మార్పిడి స్టేషన్లతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని, ముఖ్యంగా కేవలం రెండు నిమిషాల్లోనే బ్యాటరీని మార్చివేయవచ్చునని పేర్కొంది. మరోవైపు, బ్యాటరీలను అద్దెకు తీసుకునే అవకాశం కూడా ఉన్నదని తెలిపింది.