జైపూర్, అక్టోబర్ 7: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్..తాజాగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. తొలి స్కూటర్ ‘విదా వీ1’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ విదా వీ1 ప్లస్ ధరను రూ.1.45 లక్షలుగాను, విదా వీ1 ప్రో మోడల్ ధరను రూ.1.59 లక్షలుగా నిర్ణయించింది.
సింగిల్ చార్జింగ్తో వీ1 ప్లస్ 143 కిలోమీటర్లు ప్రయాణించనుండగా, వీ1 ప్రో మాత్రం 165 కిలోమీటర్లు ప్రయాణించనున్నదని హీరో మోటోకార్ప్ సీఎండీ పవన్ ముంజల్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ నెల 10 నుంచి ముందస్తు బుకింగ్లు ఆరంభించిన సంస్థ..బుకింగ్ చేసుకున్నవారికి డిసెంబర్ రెండో వారం నుంచి వాహనాలను అందచేయనున్నట్లు ఆయన చెప్పారు. బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ ఎనర్జీ, హీరో ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్లకు పోటీగా సంస్థ విదా వీ1 మోడల్ను ప్రవేశపెట్టింది.