Hero EV Charging Stations | అన్ని వాహనాలకు చార్జింగ్ ఫెసిలిటీ కల్పిస్తూ దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ వసతులను విస్తరించాలని ప్రణాళిక రూపొందించినట్లు ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీసంస్థ హీరో ఎలక్ట్రిక్ శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా అదనంగా 10 వేల చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పుతామని తెలిపింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మౌలిక వసతుల కల్పన కోసం మాసివ్ మొబిలిటీ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది లోపు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు హీరో ఎలక్ట్రిక్ వివరించింది.
తాము ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్ల నెట్ వర్క్ అన్ని ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్కు వెసులుబాటుగా ఉంటుందని తెలిపింది. ఈవీ చార్జింగ్ స్టేషన్ల వినియోగంపై కన్జూమర్ల వైఖరిపై తమ సంస్థలు సర్వే జరిపామన్నది.
ఇంటర్నెట్లో యాప్ ద్వారా స్మార్ట్ చార్జర్ల కోసం వినియోగదారులు (ఎలక్ట్రిక్ వెహికల్ యజమానులు) వెతుకుతున్నారు. 16 ఏఎంపీ చార్జింగ్ స్టేషన్ల వద్ద లాంగ్ చార్డ్స్ ఉన్నాయి. మాసివ్ చార్జింగ్ యాప్లో యూజర్లు తమ ప్రొఫైల్ సెటప్ చేస్తే వారికి వై-ఫై నెట్వర్క్ సహాయకారిగా ఉంటుంది. దీంతో యూపీఐ ఫ్రేమ్ వర్క్ ద్వారా నిరంతరాయ చెల్లింపులు జరుపవచ్చు అని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.
తదుపరి దశకు ఈవీ ఇండస్ట్రీని తీసుకెళ్లేందుకు కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దోహదం చేస్తాయి. పర్యావరణ హిత వ్యవస్థను నెలకొల్పడానికి రీ సైక్లింగ్ మెకానిక్స్తో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ తెలిపారు.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 1650 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశాం, 2022 చివరికల్లా 20 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని సోహిందర్ గిల్ వెల్లడించారు.