ఆవిష్కరించిన హీరో ఎలక్ట్రిక్
న్యూఢిల్లీ, మార్చి 1: హీరో ఎలక్ట్రిక్ మంగళవారం సరికొత్త టూవీలర్ మోడల్ను ఆవిష్కరించింది. దేశీయ మార్కెట్ కోసం హీరో ఎడ్డీని పరిచయం చేసింది. అయితే ఎల్లో, లైట్ బ్లూ రంగుల్లో లభించనున్న ఈ విద్యుత్ ఆధారిత ద్విచక్ర వాహనాన్ని వచ్చే త్రైమాసికంలో మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నట్టు ఓ ప్రకటనలో హీరో తెలియజేసింది. ఫైండ్ మై బైక్, లార్జ్ బూట్ స్పేస్, ఫాల్లో మీ హెడ్ల్యాంప్స్, రివర్స్ మోడ్ వంటి ప్రత్యేకతల్ని ఈ టూవీలర్ ద్వారా తమ కస్టమర్లకు హీరో అందిస్తున్నది. ఇక ఈ వాహనానికి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.