IndiGo CEO | భారత్ వైమానిక రంగంలో హెల్తీ, టఫ్ కాంపిటీషన్ నెలకొందని దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. ప్రైస్ సెన్సిటివ్ నెస్ కూడా ఉందని చెప్పారు. దేశంలో విమానయానానికి అద్భుతమైన డిమాండ్ ఉందన్నారు. దేశీయంగా 360కి పైగా విమానాలతో 60 శాతం మార్కెట్ వాటా ఇండిగో సొంతం. ఓవరాల్గా విమానయాన రంగంలో టికెట్ల ధరలు ‘చాలాచాలా పోటీతత్వం’తో నిలిచాయని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు.
కొత్తగా దేశంలోని వివిధ ప్రదేశాలకు విమాన సర్వీసులను అనుసంధానించినప్పుడు కొన్ని వర్గాల నుంచి విమాన ప్రయాణ టికెట్ల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుందని పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ప్రత్యేకించి రద్దీ సమయంలో టికెట్ల ధరలు ఎక్కువగా ఉంటాయన్నారు. విమాన టికెట్ల ధరలపై నియంత్రణ ఎత్తేయాలని అన్నారు. డిమాండ్ అండ్ సప్లయ్కి అనుగుణంగా విమాన టికెట్ల ధరలు ఉండాలని చెప్పారు.