హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): బహుళజాతి కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన హెల్త్కేర్ కంపెనీ ప్రైమ్ఎరా సైతం.. ఐటీ కారిడార్లో భారీ విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకున్నది. మెడికల్ టెక్నాలజీస్లో అత్యాధునిక సేవలను అందించేందుకు ఈ కార్యాలయ స్థలాన్ని పొందింది. మాదాపూర్లోని జైన్ సద్గురు క్యాపిటల్ పార్క్ భవనంలో సుమారు 1.48 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ ఆఫీస్ స్పేస్ ఉన్నది.
కరోనా తగ్గుముఖం పట్టిన దగ్గర్నుంచి ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ దూసుకుపోతున్నది. అనరాక్.. ఏటా విడుదల చేసే నివేదిక కూడా ఇదే చెప్తున్నది. ఎక్కువ మొత్తంలో ఆఫీస్ స్పేస్ను అందుబాటులోకి తెస్తున్న నగరాల్లో హైదరాబాద్ ప్రధానంగా ఉంటున్నది మరి. ఆఫీస్ స్పేస్కు డిమాండ్ ఉండటంతో రియల్ ఎస్టేట్ సంస్థలు ఏ గ్రేడ్ కార్యాలయ స్థలాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలోని కంపెనీలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి.