ముంబై: మార్ట్గేజ్ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్..పలు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన వడ్డీరేట్లు మార్చి 30 నుంచి అమలులోకి వచ్చాయని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తున్న ప్రస్తుత తరుణంలో హెచ్డీఎఫ్సీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.