న్యూఢిల్లీ, జూలై 15: గృహ రుణాలు తీసుకునేవారికి బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీ) శుభవార్తను అందించింది. ప్రాసెసింగ్ ఫీజును 50 శాతం నుంచి 100 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కనీసంగా రూ.2 వేలు, గరిష్ఠంగా రూ.5 వేల వరకు రాయితీ పొందవచ్చునని పేర్కొంది. ఆగస్టు 31 లోపు తీసుకునే గృహ రుణాలకు ఇది వర్తించనున్నదని తెలిపింది. ప్రస్తుతం రుణ మొత్తంలో 0.35 శాతం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నది. సిబిల్ స్కోర్ 750-800 కంటే అధికంగా ఉన్నవారికి ఈ రాయితీ లభించనున్నది.