హైదరాబాద్, ఫిబ్రవరి 8: ముంబై విమానాశ్రయంలో వాటా విక్రయానికి సంబంధించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై జీవీకే గ్రూపు స్పందించింది. ఈ వాటా విక్రయానికి సంబంధించి ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిడి రాలేదని స్పష్టంచేసింది. దేశంలో అత్యంత రద్దీ విమానాశ్రయమైన ముంబై అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను జీవీకే గ్రూపు నుంచి అదానీ గ్రూపునకు కట్టబెట్టడానికి కేంద్రం సీబీఐ, ఈడీలతో దాడులు చేపించిందని రాహుల్ ఆరోపణలు చేశారు. దీనిపై జీవీకే గ్రూపు వైస్ చైర్మన్ సంజయ్ రెడ్డి మాట్లాడుతూ..నిధులను సేకరించాలనే ఉద్దేశంతో విమానాశ్రయ వ్యాపారంలో వాటాను విక్రయించినట్టు చెప్పారు.