న్యూయార్క్ : ఎలన్ మస్క్ ప్రవేశపెట్టిన సొంత ఏఐ చాట్బాట్ గ్రోక్ ఏఐ (GrokAI) ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులోకి రాగా ప్రస్తుతం భారత్లోనూ అందుబాటులో ఉంది. అయితే ఈ ఏఐ చాట్బాట్ను కేవలం ఎక్స్ ప్రీమియం+ యూజర్లు మాత్రమే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. గ్రోక్ఏఐ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను వెబ్ బ్రౌజర్లో యాక్సెస్ చేసుకోవాలనే వివరాలను చూస్తే..ఎక్స్ హోమ్పేజ్ ఓపెన్ చేసి లాగిన్ అవగానే సైడ్ మెనూలో గ్రోక్ పేరిట న్యూ ట్యాబ్ కనిపిస్తుంది.
మీ ఫోన్ యాప్ ద్వారా ఎక్స్ను యాక్సెస్ చేస్తే ట్విట్టర్లో మీ ప్రొఫైల్ పిక్పై క్లిక్ చేయగానే సైడ్ మెనూకు వెళ్లి గ్రోక్ ట్యాబ్ను లొకేట్ చేస్తారు. ఎక్స్ ప్రీమియం ప్లస్ సబ్స్క్రైర్ అయితే మీరు ఈ ట్యాబ్పై క్లిక్ చేసి నేరుగా చాట్బాట్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ప్రీమియం ప్లస్ సబ్స్క్రైబర్ కానివారు కింద కనిపించే అప్గ్రేడ్ టూ ప్రీమియం+ ట్యాబ్ ద్వారా అప్గ్రేడ్ కావచ్చు.
గ్రోక్ఏఐ వినియోగించుకునేందుకు ప్రీమియం+ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఈ ట్యాబ్పై క్లిక్ చేసి అక్కడ ఇచ్చే స్టెప్స్ను అనుసరించవచ్చు. భారత్లో ప్రీమియం+ సబ్స్క్రిప్షన్ నెలకు రూ. 1300 కాగా, వెబ్ వెర్షన్కు ఏడాదికి రూ. 13,600. మొబైల్ యాప్లో ప్రీమియం ప్లాన్ ఏటా రూ. 22,900 కాగా నెలకు రూ. 2299 చార్జ్ చేస్తారు. చాట్జీపీటీతో పోలిస్తే గ్రోక్ ఏఐ ఖరీదైనది కావడం విశేషం. ఓపెన్ఏఐ చాట్బాట్ మొబైల్ యాప్పై నెలకు రూ. 1,999 చార్జ్ చేస్తోంది.
Read More :
BJP Leader | బీజేపీ నాయకుడి ఇంట్లో విదేశీ మద్యం.. 14 వేల బాటిల్స్ సీజ్