హైదరాబాద్, డిసెంబర్ 13: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం గ్రాన్యూల్స్కి చెందిన మరో ఔషధానికి అమెరికా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గ్యాస్ట్రో ఎసోపాగియల్ రిఫ్లక్స్ వ్యాధితో సంబంధమున్న ఎరోసివ్ ఎసోఫాగిటిస్ నియంత్రించే ఔషధానికి జనరిక్ వెర్షన్ పాంతోపాజోల్ సోడియం ట్యాబ్లెట్కు అమెరికా మార్కెట్లో ఉత్పత్తి, విక్రయించడానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ఎఫ్డీఏ) అనుమతినిచ్చినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పాంటోప్రజోల్ సోడియం ట్యాబ్లెట్ 20 ఎంజీ, 40 ఎంజీల్లో లభించనున్నది.