న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ప్రభుత్వ సంస్థలు పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం లేదా ప్రతీ కంపెనీలో ఎంతోకొంత వాటా అమ్మేసి ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి ఆతృతపడుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా జలవిద్యుత్ సంస్థ ఎస్జేవీఎన్లో షేర్లను విక్రయించడానికి సిద్ధమయ్యింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో రెండు రోజులు జరిపే మార్కెట్ బిడ్డింగ్ ద్వారా 4.92 శాతం వాటాను అమ్మకానికి పెట్టింది.
నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు ఎస్జేవీఎన్ ఆఫర్ గురువారం ప్రారంభమవుతుందని దీపం కార్యదర్శి తుహిన్కాంత్ పాండే ఎక్స్ (గతంలో ట్విటర్)లో పోస్ట్ చేశారు. రిటైల్ ఇన్వెస్టర్లు శుక్రవారం బిడ్స్ వేయవచ్చు. ఓఎఫ్ఎస్కు షేరుకు రూ. 69 చొప్పున ఫ్లోర్ ధరను నిర్ణయించారు. ఈ ధరపై 4.92 శాతం వాటాకు (9.66 కోట్ల షేర్లు) కేంద్ర ఖజానాకు రూ.650 కోట్లు సమకూరుతుంది. బుధవారం బీఎస్ఈలో ఎస్జేవీఎన్ షేరు 6.78 శాతం పెరిగి రూ.81.75 వద్ద ముగిసింది.