న్యూఢిల్లీ, ఆగస్టు 5: ల్యాప్టాప్, కంప్యూటర్ల దిగుమతి ఆంక్షల అమలును కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు వాయిదావేసింది. అక్టోబర్ 31 వరకు ఆయా ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని సంబంధిత వర్గాలు స్పష్టంచేశాయి. దీంతో లైసెన్స్ లేకుండా ఎలక్ట్రానిక్ కంపెనీలు ఉపకరణాలను దిగుమతి చేసుకోవడానికి వీలుంటుంది.
కానీ, నవంబర్ 1 తర్వాత ఆయా సంస్థలు లైసెన్స్ తీసుకొని ల్యాప్టాప్, కంప్యూటర్లు, ట్యాబ్లను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర సర్కార్ ఈ నెల 3న ల్యాప్టాప్, కంప్యూటర్లు, ట్యాబ్ల దిగుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.