న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్ దొరై స్వామి నియమితులయ్యారు. ప్రస్తు తం ముంబైలోని ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న దొరైస్వామికి పదొన్నతి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల చివర్లో పదవీ విరమణ చేయనున్న ఐపీ మినీ స్థానంలో దొరైస్వామిని నియమించింది. వచ్చే నెల 1న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.