SBI Alert | భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. మరోమారు ఫేక్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేశారన్న మెసేజ్ సర్క్యులేట్ అవుతున్నది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ హ్యాండిల్ హెచ్చరిక చేసింది.
ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇటువంటి నకిలీ మెసేజ్లు, ఈ-మెయిల్స్ పట్ల స్పందించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మెసేజ్ల ఆధారంగా మీ పర్సనల్, ఖాతా డేటా వివరాలు షేర్ చేయవద్దని హెచ్చరించింది.
ఇలా ఎస్బీఐ ఖాతాదారులకు నకిలీ మెసేజ్లు రావడం కొత్తేమీ కాదు. కేవైసీ నిబంధనలు పాటించనందు వల్ల కస్టమర్ల ఖాతాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు గత మార్చిలో మెసేజ్లు వచ్చాయి. ఈ విషయమై సైబర్ మోసగాళ్లు ఓ లింక్ పంపి.. అప్డేట్ చేయమని కోరారు కూడా. ఈ నకిలీ మెసేజ్లకు స్పందించవద్దని ఎస్బీఐ తన ఖాతాదారులకు సమాచారం ఇచ్చింది.