Google : గూగుల్ సంస్థ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. మ్యాపింగ్ సర్వీస్ వేజ్, జియో ఎర్త్ను ఒకే గొడుకు కిందకు తెస్తున్నట్టు గూగుల్ గురువారం ప్రకటించింది. దాంతో, వేజ్ సంస్థలో పనిచేస్తున్న 500 మందిని ఇకనుంచి గూగుల్ జియో ఉద్యోగులుగా పరిగణిస్తారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. అంతేకాదు త్వరలోనే వేజ్ సీఈఓ నేహా పారిఖ్ కంపెనీని వీడనున్నట్టు గూగుల్ తెలిపింది. వేజ్ టీమ్ను జియోలోకి తీసుకోవడం వల్ల వాళ్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది అని గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గూగుల్ సర్వీస్లను మరింత ఉపయోగకరంగా మారుస్తామని, రెండు కంపెనీల్లో పెట్టుబడులను ఒకే సంస్థ కిందకు తెస్తామని జూలై 12వ తేదీన గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ ఒక లెటర్లో తెలిపారు. ఈ నేపథ్యంలో వేజ్ను, గూగుల్ మ్యాప్స్లో కలిపేందుకు గూగుల్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
గూగుల్ జియో కోసం వేజ్ మ్యాపింగ్ సర్వీస్ను 2013లో వంద కోట్ల డాలర్లకు గూగుల్ కొనుగోలు చేసింది. ఇది గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, స్ట్రీట్ వ్యూ మ్యాపింగ్ రూపొందించడం వంటి పనులు చేస్తుంది. ఇకనుంచి వేజ్ అనేది సింగిల్ యాప్గా ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా వేజ్ యాప్ను ఏటా 15 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు.