Google CEO : గూగుల్ కార్యాలయం రాజకీయాలకు వేదిక కాదని ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో టెక్ దిగ్గజం సీఈవో సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ఇది వ్యాపారమని, ఉద్యోగులు సహోద్యోగులు అభద్రతకు లోనయ్యేలా గూగుల్ను తమ వ్యక్తిగత ప్లాట్ఫాంగా వాడుకోరాదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్తో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ నింబస్కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన 28 మంది ఉద్యోగులపై గూగుల్ వేటు వేసిన అనంతరం సుందర్ పిచాయ్ ఉద్యోగులకు ఈ మెమో పంపడం గమనార్హం.
పనిప్రదేశం రాజకీయాలపై చర్చించేందుకు, విఘాతం కలిగించే అంశాలపై వాదులాటకు వేదిక కారాదని నోట్ చివరిలో మిషన్ ఫస్ట్ పేరిట పొందుపరిచిన సెషన్లో సీఈవో స్పష్టం చేశారు. కంపెనీ ముఖ్యమైన దశలో ఉందని పరధ్యానానికి ఆస్కారం లేదని పేర్కొన్నారు.
మనం ఎలా పనిచేయాలి, సమన్వయం చేసుకోవాలి, పరస్పర చర్చలు, భిన్నాభిప్రాయాలను స్వీకరించడంపై కేంద్రీకరించాలని నోట్లో పేర్కొన్నారు. అద్భుతమైన ఉత్పత్తులు, గొప్ప ఆలోచనలకు కార్యాచరణ జోడించడంపై చర్చించే సంస్కృతి గూగుల్ సొంతమని సుందర్ పిచాయ్ రాసుకొచ్చారు. ఈ సంస్కృతిని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
Read More :
LB nagar | ఎల్బీనగర్ కార్యకర్తల సమావేశంలో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు