న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.47 వేల దిగువకు చేరింది. ఇవాళ ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.126 తగ్గి రూ.46,967కు దిగివచ్చింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,093 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గడమే ఇవాళ దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా వెండి ధరలు కూడా ఢిల్లీలో ఇవాళ స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.97 తగ్గి రూ.66,856కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,953 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,805 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.39 అమెరికన్ డాలర్లు పలికింది.