Gold Rates Hike | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర వారం గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర 2,042 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఫెడ్ మినిట్స్ రిలీజ్తో పాటు, యూఎస్ డాలర్ బలహీనపడడంతో బంగారం ధర పెరిగింది. ఈ క్రమంలో భారత్లోనూ బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.250 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.180 వరకు ఎగిసింది.
ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.57,600కి పెరిగింది. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,740కి చేరింది. అదే సమయంలో వెండి ధర సైతం స్వల్పంగా పైకి కదిలింది. దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.58,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,380కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.57,600 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.62,740కి పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,740కి చేరింది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.57,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,740కి పెరిగింది. ఏపీలోని విజయవాడ, కేరళ, బెంగళూరు, పుణే నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు పుత్తడి కిలోకు రూ.200 వరకు పెరిగి.. రూ.75,700 వద్ద ట్రేడవుతున్నది. హైదరాబాద్లో కిలో వెండి రూ.77,200 పలుకుతున్నది. అదే సమయంలో ప్లాటినం ధరలు స్థిరంగా కొనసాగుతున్నది. తులానికి రూ.24,100 వద్ద నిలకడగా ఉన్నది.