న్యూఢిల్లీ, మార్చి 24: గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1,200 అందుకొని రూ.1.44 లక్షలకు చేరుకున్నది. కానీ వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర సోమవారం రూ.1,43,600 వద్ద నిలిచింది.
అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ఉత్పత్తుల ధరలు తిరిగి పుంజుకోవడం వల్లనే దేశీయంగా బంగారం ధర పెరిగిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లో గత తొమ్మిది రోజులుగా తగ్గుతూ వచ్చిన ఔన్స్ గోల్డ్ ధర 16.96 డాలర్లు బలపడి 4,423.83 డాలర్లకు ఎగబాకగా, వెండి 1.03 శాతం అందుకొని 69.86 డాలర్లకు చేరుకున్నది.
ఇరాన్పై వచ్చే ఐదురోజుల పాటు ఎలాంటి దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఈక్విటీ మార్కెట్లతోపాటు బులియన్ మార్కెట్లు ఎగువ ముఖం పట్టాయి.