న్యూఢిల్లీ, ఆగస్టు 9: గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు)లో గత నెల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. జూలైలో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి రూ.457 కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ వ్యూహంలో భాగంగా మదుపరులు తమ పెట్టుబడులను ఇతర సాధనాల్లోకి మార్చుతుండటమే ఇందుకు కారణంగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎల్ఎక్స్ఎంఈ వ్యవస్థాపకులు ప్రతీ రాఠీ గుప్తా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు నెల జూన్లో రూ.135 కోట్ల పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చినట్టు భారతీయ మ్యూచువల్ ఫండ్స్ సంఘం (ఆంఫీ) గణాంకాలు చెప్తున్నాయి. ‘వడ్డీరేట్ల పెరుగుదల బంగారం ధరల్లో పతనానికి దారితీయవచ్చని మదుపరులు అంచనా వేస్తున్నారు. అలాగే డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణత కూడా పసిడి డిమాండ్, సైప్లెలను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. అందుకే గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఈ పెట్టుబడుల ఉపసంహరణ. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు కనిపిస్తున్నది’ అని మార్నింగ్స్టార్ ఇండియా రిసెర్చ్ సీనియర్ అనలిస్ట్ మేనేజర్ కవితా కృష్ణన్ అన్నారు.