న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.66 తగ్గి రూ.46,309కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,375 వద్ద ముగిసింది. అయితే వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.332 తగ్గి రూ.67,248కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర 66,916 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ వెండి ధర 1,782 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.17 అమెరికన్ డాలర్లు పలికింది.