ముంబై: వచ్చే రెండేండ్లలో రియాల్టీ రంగంలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు రియల్ ఎస్టేట్ సంస్థ ‘గోద్రేజ్ ప్రాపర్టీస్’ సన్నాహాలు చేస్తున్నది. కరోనా మహమ్మారి వేళలోనూ సంస్థ లాభాల బాటలో పయనిస్తున్నది.
మున్ముందు మరిన్ని లాభాల బాటలో పయనించాలని గోద్రెజ్ భావిస్తుంది. కొత్త ప్రాజెక్టు కొనుగోలుతోపాటు డెవలప్మెంట్ నిమిత్తం ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు గోద్రేజ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఫిరోజ్ షా తెలిపారు.
అధిక వృద్ధిని సాధించాలనేదే తమ లక్ష్యమని ఫిరోజ్ షా చెప్పారు. ఇందులో భాగంగా వచ్చే రెండేండ్లలో దాదాపు రూ. 7,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని తెలిపారు.
కాగా, దేశంలోనే తమ సంస్థ అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా నిలిచిందని గోద్రేజ్ పేర్కొంది. కరోనా సంక్షోభంలో ఉన్నా గత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ బుకింగ్లు 14 శాతం పెరిగాయన్నది. రికార్డు స్థాయిలో రూ. 6,725 కోట్లుగా నమోదయ్యాయని గోద్రేజ్ ప్రాపర్టీస్ తెలిపింది.