న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఇండోనేషియాకు చెందిన బొగ్గు గనుల సంస్థ పీటీ గోల్డెన్ ఎనర్జీ మైన్స్(పీటీ జెమ్స్)కు జీఎమ్మార్ గ్రూపు గుడ్బై పలికింది. 30 శాతం వాటాను 420 మిలియన్ డాలర్లకు(రూ.3,360 కోట్లు) విక్రయించినట్లు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. విమానాశ్రయేతర వ్యాపారాల్లో ఉన్న వాటాను తగ్గించుకుంటూ వస్తున్న జీఎమ్మార్ గ్రూపు తాజాగా.. జీటీ జెమ్స్లో జీఎమ్మార్ కోల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్(జీసీఆర్పీఎల్)కు ఉన్న 30 శాతం వాటాను పీటీ రాధికా జనంత రాయాకు విక్రయించింది. మౌలిక రంగ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించడంలో భాగంగా నాన్-కోర్ వ్యాపారాలకు స్వస్తి పలుకుతున్నట్లు జీఎమ్మార్ గ్రూపు కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు.