హైదరాబాద్, జూన్ 10: ఏఐ, డాటా సెక్యూరిటీ సేవల సంస్థ థియోమ్.. దేశీయ కార్యకలాపాలు ప్రారంభించడంలో భాగంగా హైదరాబాద్లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని బుధవారం ప్రారంభించింది.
కంపెనీ చరిత్రలో ఇదొక మైలురాయి వంటిదని, అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా ఇక్కడ జీసీసీ సెంటర్ను ప్రారంభించినట్టు కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ నవీంద్ర యాదవ్ తెలిపారు. ప్రస్తుత త్రైమాసికం ముగిసేనాటికి 50 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించారు.