ముంబై, డిసెంబర్ 2: దేశీయ విమాన ట్రాఫిక్లో మూడో అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్లో అంతర్జాతీయ విమాన ప్రయాణికులు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని కాపా ఇండియా చీఫ్ కపి కౌల్ తెలిపారు. మార్గదర్శకాలను మార్చకపోతే భవిష్యత్తులో మరింత తగ్గే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. దేశీయంగా విమానాలు ఎక్కేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, విదేశాలను సందర్శించేవారు ఏడాది ఏడాదికి తగ్గుతున్నారన్నారు.
దేశీయ ట్రాఫిక్లో మూడో స్థానంలో ఉండగా, గ్లోబల్గా 18వ స్థానంలో నిలిచినట్టు జేఆర్డీ టాటా 119వ పుట్టినరోజు సందర్భంగా జేఆర్డీ టాటా మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్లో తలసరి విమాన సీట్ల వినిమయం 0.13గా ఉండగా, అదే ఆస్ట్రేలియాలో 3.11గా ఉన్నది. రెండేండ్ల క్రితం ఎయిర్ ఇండియాను ప్రైవేట్పరం చేస్తూ తీసుకున్న నిర్ణయం విమానయాన రంగంలో విప్లవాత్మకమైదని, దీంతో ఈ రంగంలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. 2004లో అంతర్జాతీయంగా ప్రయాణించిన ప్రయాణికులతో పోలిస్తే గత 15 ఏండ్లలో 10 శాతం సరాసరి వృద్ధితో 6.95 కోట్లకు చేరుకున్నారు.