హైదరాబాద్, జనవరి 24: వచ్చే ఏడాది చివర్లోగా తమ తొలి గిగా ఫ్యాక్టరీని ఉత్పత్తిలోకి తెస్తామన్న ఆశాభావాన్ని ఆటోమోటివ్ బ్యాటరీ తయారీ దిగ్గజం అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ వ్యక్తం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన ఓ సదస్సులో సంస్థ అధ్యక్షుడు విజయానంద్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గిగా ఫ్యాక్టరీ ప్రారంభానికి హై టెక్నాలజీ, భారీ పెట్టుబడి, పెద్ద మొత్తంలో అనుబంధ పరిశ్రమల అవసరం ఉంటుందన్నారు. గత ఏడాది మే నెలలో మహబూబ్నగర్ జిల్లాలో అమర రాజా తమ తొలి గిగా ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ లిథియం సెల్స్, బ్యాటరీ ప్యాక్స్ను తయారు చేయనున్నారు.