గౌతమ్ అదానీ సంపద రోజుకింత పడిపోతున్నది. ఈ క్రమంలోనే బుధవారం ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ల జాబితాలో 15వ స్థానానికి దిగజారారు. దీంతో 9వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. మళ్లీ భారత్లో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. కాగా, వారం రోజుల క్రితం అదానీ టాప్-3లో ఉన్నారు. అయితే హిండెన్బర్గ్ నివేదికతో అదానీ సంపద కరిగిపోవడం మొదలైంది. గడిచిన వారం రోజుల్లో 44 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది. ఈ మొత్తం గత ఏడాది పెరిగిన దానికి సమానం కావడం గమనార్హం. ప్రస్తుతం అదానీ సంపద 75.1 బిలియన్ డాలర్లుగా ఉంటే.. ముకేశ్ సంపద 83.7 బిలియన్ డాలర్లుగా ఉన్నది.