Mukesh Vs Adani | రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ మళ్లీ షాక్ ఇచ్చారు. భారత అగ్రశ్రేణి కుబేరుడి హోదా .. ముకేశ్ అంబానీ, గౌతం అదానీ మధ్య దోబూచులాడుతున్నది. ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 99.7 బిలియన్ల డాలర్లయితే, గౌతం అదానీ సంపద 109 డాలర్లకు చేరుకుంది. ఫలితంగా ముకేశ్ అంబానీ 11వ ర్యాంక్కు పడిపోయాయిరు. గౌతం అదానీ .. ఒరాకిల్ సీఈవో ల్యారీ ఎల్లిసన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మేర్నూ దాటేశారు. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-10లో ఎనిమిదో స్థానానికి వచ్చేశారు.
గతేడాది కాలంలో అదానీ వ్యక్తిగత సంపద 32 బిలియన్ డాలర్లు పెరిగిందని బ్లూంబర్గ్ రియల్టైం బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. అదానీ గ్రూప్.. నౌకాశ్రయాల నుంచి విమానాశ్రయాలు, థర్మల్ విద్యుత్, బొగ్గు తదితర రంగాల్లో సేవలందిస్తున్నది. ఇక రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గత ఏడాది కాలంలో 7.72 బిలియన్ల డాలర్ల వ్యక్తిగత సంపద పెంచుకున్నారని బ్లూంబర్గ్ నివేదిక సారాంశం.
ఇదిలా ఉంటే ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ ఇండెక్స్లో అదానీ 109.8 బిలియన్ల డాలర్లతో 9వ స్థానంలో ఉన్నారు. ముకేశ్ అంబానీ 98.8 బిలియన్ల డాలర్లతో 10వ స్థానంలో ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. భారత్లో హరిత ఇంధన రంగంలో వసతులను అభివృద్ధి చేయడానికి వచ్చే దశాబ్ధిలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. గత నెలలో అదానీ పవర్ స్క్రిప్ట్ 120 శాతానికి పైగా లాభ పడితే, అదానీ విల్మార్ 87 శాతానికి పైగా లబ్ధి పొందింది.