Gautham Adani | ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారు సౌదీ ఆరామ్కోతో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. తాజాగా సౌదీలో వ్యూహాత్మక భాగస్వాముల కోసం గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ అన్వేషణ సాగిస్తున్నట్లు సమాచారం.
సౌదీ అరామ్కో, సౌదీ ప్రభుత్వ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వంటి సంస్థల్లో జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ల కోసం గౌతం అదానీ ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) .. సౌదీ అరేబియా సావరిన్ వెల్త్ ఫండ్. భారత్లోని మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నది.
ఆరామ్కోలో పీఐఎఫ్ వాటా కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనపైనా గౌతం అదానీ చర్చించారని తెలుస్తున్నది. సౌదీ అరామ్కో అనుబంధ సంస్థలతోనూ భాగస్వామ్యానికి గల అవకాశాలనూ ఆయన పరిశీలిస్తున్నారని సమాచారం. దీనిపై స్పందించడానికి గౌతం అదానీ ఆధ్వర్యంలోని అదానీ గ్రూప్, సౌదీ అరామ్ కో నిరాకరించాయి.