న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) ఆస్తుల్ని రిలయన్స్ రిటైల్కు విక్రయించేందుకు ప్రతిపాదించిన లావాదేవీని సెక్యూర్డ్ రుణదాతలు (ఆస్తుల్ని తనఖా ఉంచుకుని రుణాలిచ్చినవారు) తిరస్కరించారు. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్కు రూ. 24,713 కోట్లకు ఫ్యూచర్ రిటైల్ను విక్రయించేందుకు కిషోర్ బియాని నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ గతంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ లావాదేవీపై జరిగిన ఓటింగ్లో షేర్హోల్డర్లు, అన్సెక్యూర్డ్ రుణదాతల్లో 75 శాతం ఆమోదించారని, 69.29 శాతం మెజారిటీ సెక్యూర్డ్ రుణదాతలు తిరస్కరించారని ఎఫ్ఆర్ఎల్ శుక్రవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఈ లావాదేవీ పూర్తికావడానికి 75 శాతం సెక్యూర్డ్ రుణదాతలు అనుమతించడం అవసరం. డీల్కు 85.94 శాతం మంది షేర్హోల్డర్లు ఆమోదం తెలిపారని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే ఈ లావాదేవీని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కోర్టుల్లో పోరాటం జరుపుతున్న సంగతి తెలిసిందే.