న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: డిజిటల్ ఇంజినీరింగ్, బిజినెస్ ప్లాట్ఫాం సేవల సంస్థ ఫుల్క్రమ్ డిజిటల్ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. కృత్రిమ మేధస్సుకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ ఏడాది కొత్తగా 700 మంది సిబ్బందిని నియమించుకోవాలనుకుంటున్నట్టు కంపెనీ చైర్మన్ రాజేశ్ సిన్హా తెలిపారు.
బిగ్ డాటాబేస్ను మరింత సరళతరం చేయాలనే ఉద్దేశంతో సంస్థ ఇటీవల రైజ్, జనరేటివ్ ఏఐ ప్లాట్ఫాం సేవలను ప్రారంభించినట్లు చెప్పారు. డాటా సైంటిస్ట్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, కృత్రిమ మేధస్సుపై పట్టున్నవారిని భారత్తోపాటు విదేశాల్లో రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించారు. న్యూయార్క్ చెందిన డిజిటల్ సంస్థ ఫుల్క్రమ్కు భారత్తోపాటు అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్లలో కార్యాలయాలు ఉన్నాయి.