హైదరాబాద్/శంషాబాద్ రూరల్, జూన్ 29 : జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్మ అనుబంధ సంస్థయైన జీఎమ్మార్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్లో ఎఫ్టీజీ(ఫిరాన్ టెక్నాలజీ గ్రూపు కార్పొరేషన్) దేశంలో తన తొలి తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. కెనడా, అమెరికా, చైనా తర్వాత నాలుగో అంతర్జాతీయ తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం.
ఈ సందర్భంగా ఎఫ్టీజీ కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీఈవో బాడ్ బోర్న్ మాట్లాడుతూ..దేశంలో తొలి తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం వ్యూహాత్మక కీలక మైలురాయి వంటిదని, ఇక్కడ ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ నైపుణ్యం కలిగిన సిబ్బంది లభించడం..వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, రక్షణ రంగం, తయారీ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలు ఈ యూనిట్ను ఏర్పాటు చేయడానికి దోహదం చేశాయన్నారు. ఈ నూతన ప్లాంట్ను అడ్వాన్స్ టెక్నాలజీపై దృష్టి సారించడానికి వీలు పడనున్నదని, అలాగే అంతర్జాతీయ ఏరోస్పేస్, రక్షణ రంగంలో కీలక ముద్ర వేయడానికి దోహదం చేయనున్నదన్నారు.