హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఎఫ్టీసీసీఐ) తమ వార్షిక ఎక్సలెన్స్ అవార్డులు-2025 కోసం దరఖాస్తుల గడువును ఈ నెల 15 వరకు పొడిగించింది. మొదట ప్రకటించిన ప్రకారం దరఖాస్తులకు ఈ నెల 10తో గడువు ముగుస్తుండగా, పలువురు పారిశ్రామికవేత్తల విజ్ఞప్తిమేరకు గడువు పొడిగించినట్లు ఎఫ్టీసీసీఐ అధ్యక్షులు సురేశ్ కుమార్ సింఘాల్ తెలిపారు.