హైదరాబాద్, జూన్ 16(నమస్తే తెలంగాణ): కంపెనీ డైరెక్టర్ల శిక్షణ కోసం తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ).. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్(ఐఐసీఏ)తో ఒప్పందం చేసుకోనుంది. ఈ మేరకు ఎఫ్టీసీసీఐ ప్రతిపాదనకు ఐఐసీఏ డైరెక్టర్ జనరల్, సీఈవో డా.సమీర్ శర్మ సానుకూలత వ్యక్తంచేశారు. ఎఫ్టీసీసీఐ ఆధ్వర్యంలో బుధవారం డైరెక్టర్ల పాత్ర, బాధ్యతలు అనే అంశంపై వెబినార్ను ఏర్పాటుచేశారు. ఇందులో సమీర్శర్మ మాట్లాడుతూ.. కార్పొరేట్ పాలనలో అత్యుత్తమ ప్రమాణాలకు డైరెక్టర్ల పాత్ర ఎంతో కీలకమని, తెలంగాణలోని డైరెక్టర్లకు శిక్షణను ఇచ్చే అవకాశం లభించడం సంతోషంగా ఉందని చెప్పారు. త్వరలోనే ఒప్పం ద ప్రక్రియ పూర్తిచేస్తామని పేర్కొన్నారు.