న్యూఢిల్లీ, నవంబర్ 27: తైవాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫాక్స్కాన్కు చెందిన హాన్ హాయ్ టెక్నాలజీ.. భారత్లో 1.6 బిలియన్ డాలర్ల (రూ.13వేల కోట్లు)తో ఓ కర్మాగారాన్ని నిర్మిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం తైవాన్ స్టాక్ ఎక్సేంజీకి తెలియజేసింది. కాగా, ఈ ఫ్యాక్టరీలో ఫాక్స్కాన్ సింగపూర్ యూనిట్కు 12.83 బిలియన్ షేర్లుండనున్నాయి. ఇక ఈ ఏడాది ఆగస్టులోనే ఫాక్స్కాన్ చైర్మన్ లీ యంగ్.. భారత్లో భారీ పెట్టుబడులకు సంబంధించి సంకేతాలివ్వగా, ఆ తర్వాత ఏడాదిలోపు దేశంలోని పెట్టుబడులను, ఉద్యోగులను రెట్టింపు చేస్తామనీ పేర్కొన్న సంగతి విదితమే. చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరిస్తున్న ఫాక్స్కాన్.. ప్రధానంగా భారత్పైనే దృష్టి పెడుతున్నది.