(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ‘2047నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడతాం’ అంటూ ఊదరగొడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలన్నీ అబద్దాలేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కుండబద్దలు కొట్టారు. ఇలాంటి వాగ్ధానాలపై మాట్లాడటం కూడా అర్థంలేని చర్య (నాన్సెన్స్ టు టాక్)గా అభివర్ణించారు. దేశ ప్రస్తుత ఆర్థికవృద్ధిరేటును కావాలనే ఎక్కువ చేసి చూపిస్తున్నారన్న ఆయన.. భవిష్యత్తులో ఇది దేశానికి నష్టదాయకమేనని హెచ్చరించారు. ఈ మేరకు బ్లూమ్బర్గ్ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
రాజన్ కీలక వ్యాఖ్యలు