బీమారంగ నియంత్రణ సంస్థ భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్గా కేంద్ర ఆర్థిక సేవల శాఖ మాజీ కార్యదర్శి దేబశిశ్ పాండా నియమితులయ్యారు. ఈ మేరకు పాండా నియామకాన్ని నియామకాల కేంద్ర క్యాబినెట్ కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. ఈ పదవిలో దేబశిశ్ పాండా మూడేండ్లు ఉంటారు. ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ పాండా. కేంద్ర ఆర్థిక సేవల శాఖ కార్యదర్శిగా రెండేండ్లు పని చేసిన తర్వాత గత జనవరిలో పదవీ విరమణ చేశారు.
ఐఆర్డీఏఐ చైర్మన్ పదవి పది నెలలుగా ఖాళీగా ఉంది. గతేడాది మేలో సుభాష్ చంద్ర ఖుంతియా రిటైర్ అయ్యాక తాజాగా కేంద్రం ఐఆర్డీఏఐ చైర్మన్గా నియమించింది. ఐఆర్డీఏఐ చైర్మన్ పదవికి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ గతేడాది ఏప్రిల్ 30న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని ఇన్సూరెన్స్ సంస్థలకు లైసెన్సులను జారీ చేయడంలో, వాటి లావాదేవీలను నియంత్రించడంలో ఐఆర్డీఏఐ కీలకంగా వ్యవహరిస్తుంది. కేంద్ర ఆర్థిక ఆధీనంలో పని చేస్తుంది.