సస్థాసుందర్.కామ్లో మెజార్టీ వాటా కొనుగోలు
బెంగళూరు, నవంబర్ 19: ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్కార్ట్..తాజాగా హెల్త్కేర్ రంగంలోకి అడుగుపెట్టింది. ‘ఫ్లిప్కార్ట్ హెల్త్+’తో ఈ సేవలు ఆరంభించింది. దీంట్లో భాగంగా సస్థాసుందర్ మార్కెట్ప్లేస్ లిమిటెడ్కు చెందిన సస్థాసుందర్.కామ్లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. ఆన్లైన్ ఫార్మసీ, డిజిటల్ హెల్త్కేర్ విభాగంలో ఈ సంస్థ సేవలు అందిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న 490 ఫార్మసీలతో అనుసంధానం చేసుకొని డిజిటల్ హెల్త్కేర్, ఫార్మసీ సేవలు సస్థాసుందర్.కామ్ అందిస్తున్నదని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది.