యూపీఐ పేమెంట్ యాప్ ఫోన్ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ నుంచి బయటకొచ్చేసింది. ఫ్లిప్కార్ట్, ఫోన్పే మధ్య యాజమాన్య హక్కులను బదిలీ ప్రక్రియ ముగిసింది. దాంతో రెండు కంపెనీలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇకనుంచి ఈ రెండు కంపెనీలు విడి విడిగా పనిచేయనున్నాయి. అయితే.. ఈ రెండిటిలోనూ వాల్మార్ట్ ప్రధాన వాటాదారుడిగా కొనసాగనుంది. ఫోన్ పే, ఫ్లిప్కార్ట్ కంపెనీల సింగపూర్ ఎంటిటీస్కు చెందిన షేర్ హోల్డర్స్ ఫోన్ పే ఇండియా నుంచి నేరుగా షేర్లను కొనుగోలు చేశారు. దాంతో ఫోన్ పే ఇకపై పూర్తిగా భారత్కు చెందిన కంపెనీ అవుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దాంతో ఫోన్ పే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)లో చేరనుంది.
ఫ్లిప్కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్లు అయిన సమీర్ నిగమ్, రాహుల్ చారి, బర్జిన్ ఇంజినీర్ అనే ముగ్గురు 2015లో ఫోన్ పే యాప్ను తీసుకొచ్చారు. డిజిటల్ పేమెంట్ యాప్లో పాపులర్ అయిన ఫోన్ పేలో 400 మిలియన్ల మంది రిజిష్టర్ చేసుకున్నారు. దేశంలోని 99 శాతం అమెరికాలోని వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్ట్ సంస్థ ఫోన్ పేను 2016లో కొనుగోలు చేసింది. ‘ఫ్లిప్కార్ట్ కంపెనీ ఎన్నో విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్లను తయారుచేసింది. అంతేకాదు మాజీ ఉద్యోగులు ప్రభావంతమైన వ్యాపారం మొదలుపెట్టారు. ఫోన్ పే సొంతంగా విజయవంతమైన సంస్థగా ఎదిగినందుకు మాకు చాలా గర్వంగా ఉంది’ అని ఫ్లిప్కార్ట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.