Flipkart transision to EVs | ప్రస్తుత ఫెస్టివ్ సీజన్లో బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లో భాగంగా వినియోగదారులకు వస్తువులు, సరుకుల రవాణాకు విద్యుత్ వాహనాలను వినియోగిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. దేశంలోని 90 నగరాల పరిధిలో రెండు వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను వాడుతున్నామని పేర్కొన్నది. 2030 నాటికి వందశాతం ఎలక్ట్రిక్ వాహనాల వాడకం దిశగా అడుగులేస్తామని.. అందుకోసం 25 వేల ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి కట్టుబడి ఉన్నట్లు ఈ ఏడాది ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికోసం క్లైమేట్ గ్రూప్ ఈవీ 100 క్యాంపెయిన్తో జత కట్టింది.
ఈ ఏడాది జూలై నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకానికి ఫ్లిప్కార్ట్ స్వస్తిపలికింది. సెల్లర్ పార్టనర్స్తో కలిసి క్రమంగా సుస్థిర ప్రత్యామ్నాయ ప్యాకేజింగ్ దిశగా అడుగులేస్తున్నది. ఇందులో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, వైధాన్, విదిష, షాజాపూర్, ఝాబువా, పుణె, సొనాయి, మైసూర్, రాంపూర్తోపాటు కొన్ని నగరాలున్నాయి.
ఫ్లిప్కార్ట్ సస్టెయినబిలిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ హెడ్ మహేశ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ వందశాతం విద్యుత్ వాహనాల వాడకం దిశగా మా ప్రయాణం మొదలైంది. 90 నగరాల పరిధిలో వేల ప్రాంతాలకు 2000కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలతో మా డెలివరీ ఎగ్జిక్యూటివ్లు సరుకు రవాణా చేసేందుకు ఫ్లిప్కార్ట్ టీమ్లు కలిసి పని చేస్తున్నాయి. ఇది తమకు గర్వకారణం అని అన్నారు.