ఫిట్బిట్ భారత్లో రూ 8,999 ప్రారంభధరతో ఫ్లాగ్షిప్ స్మార్ట్వాచ్లను లాంఛ్ చేసింది. డిజైన్లో మార్పులు చేపట్టకున్నా పలు న్యూ ఫీచర్లను జోడించి సరికొత్త స్మార్ట్వాచ్లను ప్రవేశపెట్టింది. గూగుల్ కంపెనీ ఫిట్బిట్ వెర్సా 4, ఫిట్బిట్ సెన్స్ 2, ఇన్స్ఫైర్ 3 పేరుతో న్యూ స్మార్ట్వాచ్లను లాంఛ్ చేసింది.
ఫిట్బిట్ ఇన్స్ఫైర్ 3 బ్రాండ్ నుంచి అందుబాటు ధరలో కస్టమర్ల ముందుకొచ్చింది. హార్ట్రేట్ ట్రాకింగ్ సహా పలు హెల్త్ ఫీచర్లతో కూడిన ఈ వాచ్ రూ 8,999కి కస్టమర్లకు లభిస్తుంది. ఇక ఫిట్బిట్ సెన్స్ 2 న్యూ ఈడీఏ సెన్సర్తో రోజంతా మీ స్ట్రెస్ లెవెల్స్ను మెజర్ చేస్తుంది. ఇందులో 40 ఎక్సర్సైజ్ మోడ్లు, జీపీఎస్ వెసులుబాటు ఉంది. హార్ట్రేట్, స్కిన్ టెంపరేచర్ మెజర్మెంట్, న్యూ బాడీ రెస్పాన్స్ సెన్సర్ వంటి లేటెస్ట్ ఫీచర్లున్నాయి.
ఫిట్బిట్ సెన్స్ 2 స్మార్ట్వాచ్ రూ 20,499కి కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇక ఫిట్బిట్ వెర్సా 4 సెన్స్ 2ను పోలిన తరహాలో లేటెస్ట్ ఫీచర్లను కలిగిఉంది. ఇది ఆరు రోజుల బ్యాటరీ లైఫ్ను అందిస్తుండగా రెండు స్మార్ట్వాచ్లు ఫిట్బిట్ ఓఎస్పై రన్ అవుతాయి. ఇక వెర్సా 4 రూ 20,499కి లభిస్తుంది.