Indian Budget | 75 వసంతాల గణతంత్ర భారతదేశంలో ప్రతియేటా వార్షిక బడ్జెట్లు ప్రవేశ పెట్టడం సంప్రదాయంగా వస్తున్నది. ఆయా ప్రభుత్వాల్లో ఆర్థిక మంత్రులు తమ వెసులుబాటుకు అనుగుణంగా సుదీర్ఘంగా, అతి స్వల్ప ప్రసంగాలతో ముగించారు. భారతదేశ బడ్జెట్లకు కూడా ఓ చరిత్ర ఉంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 2019లో రెండో విడత అధికారం చేపట్టిన నరేంద్రమోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్నది. ఎన్నికల వేళ వివిధ వర్గాలను ఆకట్టుకోవడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంక్షేమ పథకాలు, పన్ను రాయితీలు ప్రకటిస్తారా.. లేదా.. అన్నది వేచి చూడాల్సి ఉంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఇప్పటి వరకు పార్లమెంట్కు బడ్జెట్ సమర్పించిన ఆర్థిక మంత్రుల ప్రసంగాల్లో నిర్మలా సీతారామన్దే రికార్డు
అయితే బడ్జెట్ ప్రసంగాలకు 1991లో పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్.. దేశీయ ఎకానమీని సంస్కరణల బాట పట్టించాక ప్రాధాన్యం మొదలైంది. 1951-52లో తొలి భారత వార్షిక బడ్జెట్ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ హయాంలో ప్రణాళికాబద్ధంగా రూపుదిద్దుకున్నది. అందుకు భిన్నంగా 1991-92 బడ్జెట్ స్టాక్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని బడ్జెట్ రూపొందించిన మన్మోహన్ సింగ్ లైసెన్స్ రాజ్కు తిలోదకాలు ఇవ్వడంలో సఫలమయ్యారు.
1950-51లో తొలి ప్రధాని పండిట్ నెహ్రూ అధ్యక్షుడిగా ప్రణాళికా సంఘం కనుసన్నల్లో తొలి ఆర్థిక మంత్రి జాన్ మథాయి బడ్జెట్ స్పీచ్ సాగింది. కానీ 1991-92లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంస్కరణల మాంత్రికుడు మన్మోహన్ సింగ్ ఆ సంప్రదాయానికి చెల్లుచీటి ఇచ్చారు. ఆర్థిక మంత్రులంతా విభిన్న వ్యక్తిత్వం గల వారు. 1951 నుంచి ఇప్పటి వరకు 10 మంది ఆర్థిక మంత్రులు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ ఆరో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధం అవుతున్నారు.
సీడీ దేశ్ముఖ్ 1951-57 మధ్య ఐదు, మొరార్జీ దేశాయ్ (1959-64, 1967-70), వైబీ చవాన్ (1971-75), వీపీ సింగ్ (1985-87), మన్మోహన్ సింగ్ (1991-96), యశ్వంత్ సిన్హా (1998-2004), పీ చిదంబరం (1996-98, 2004-09, 2013-14), ప్రణబ్ ముఖర్జీ (1982-85, 2009-13), అరుణ్ జైట్లీ (2014-19) మధ్య బడ్జెట్లు ప్రవేశపెట్టారు.
ఆర్థిక వ్యవస్థ సంస్కరణల బాట పట్టిన తర్వాత 1991లో మన్మోహన్ సింగ్ తొలి బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. సుమారు 18,650 పదాలతో మన్మోహన్ సంస్కరణల సమ్మోహన ప్రసంగం సాగింది. తర్వాత సగటున యశ్వంత్ సిన్హా సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. ఆయన ప్రసంగం నిడివి 15,700 పదాలు మాత్రమే. ఇందిరాగాంధీ సగటున అతి తక్కువ పదాలతో ప్రసంగం ముగించారు. మొరార్జీ దేశాయి పది వేల పదాలతో ప్రసంగిస్తే, వైబీ చవాన్ 9,300 పదాలతో బడ్జెట్ ప్రసంగం తయారు చేసుకున్నారు.
ఆర్థిక మంత్రుల బడ్జెట్ ప్రసంగాలు చతురోక్తులతో సుదీర్ఘంగా సాగాయి. ప్రస్తుతం విత్తమంత్రిగా నిర్మలా సీతారామన్ తొలిసారి 2019లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 11 వేల పదాలతో ఆమె ప్రసంగాన్ని ముగిసింది. అంతకుముందు యశ్వంత్ సిన్హా, అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగాలు చాలా సంక్లిష్టంగా ఉండేవి. దేశ్ ముఖ్ (62), దేశాయి (61) బడ్జెట్ ప్రసంగాలు సమగ్రంగా ఉండేవి. ఆర్థిక మంత్రులు సమయానుకూలంగాతమ బడ్జెట్ స్పీచ్లు మార్చేసుకునేవారంటే అతిశయోక్తి కాదు.
1950వ దశకంలో కరువు నుంచి రికవరీ దిశగా భారత్ అడుగులేస్తున్నప్పుడు దేశ్ముఖ్ బడ్జెట్ ప్రసంగాల్లో ఆహార కొరత, అధిక ధరలు, విదేశీ చెల్లింపులు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేవి. నెహ్రూ హయాంలో ‘ప్రణాళిక అన్న అంశం ఆధిపత్యం వహించేది. లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యం సాగేది. సరళీకృత విధానాలు అమలులోకి వచ్చాక మార్కెట్ల పెరుగుదల ప్రస్తావనకు వచ్చేది. కానీ ఇటీవల మళ్లీ ‘స్టేట్ అనే పదం వచ్చి చేరింది.
గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ప్రతి బడ్జెట్ ప్రసంగంలోనూ ఎవర్ గ్రీన్ గా ఉంటూ వచ్చింది. కానీ 2004 ఎన్నికల్లోవాజపేయి సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్ ఓటమితో ఆర్థికమంత్రులు వ్యవసాయ రంగంపైనే ఆర్థిక మంత్రులు బడ్జెట్లను కేంద్రీకరించి రూపొందించేవారు. 1998-2004 మధ్య పట్టణాభివృద్ధి కేంద్రంగా దృష్టిని కేంద్రీకరించి బడ్జెట్లు రూపొందించారన్న విమర్శలు ఉన్నాయి.
వ్యవసాయరంగంతోపాటు పేదరికం, హ్యూమన్ క్యాపిటల్ (హెల్త్, విద్య, పారిశుద్ధ్యం) పదాలు ప్రణబ్ముఖర్జీ, పీ చిదంబరం, అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగాల్లో ప్రస్తావనకు వచ్చేవి. పర్యావరణం, టెక్నాలజీ, లింగం, పట్టణాభివృద్ధి తదితర అంశాలు 21వ శతాబ్ధి బడ్జెట్ ప్రసంగాల్లో సర్వ సాధారణం అయ్యాయి.