Petro prices | ముంబైలో శనివారం లీటర్ డీజిల్ ధర రూ.100 మార్క్ను దాటింది. కేంద్ర చమురు సంస్థలు వరుసగా ఐదో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. లీటర్ పెట్రోల్పై 30 పైసలు, లీటర్ డీజిల్పై 35 పైసలు పెరిగాయి. దీని ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.84కు, లీటర్ డీజిల్ ధర రూ.92.47కు చేరుకున్నది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.83లకు, లీటర్ డీజిల్ ధర రూ.100.29లకు చేరుకున్నది.
కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.23లకు, లీటర్ డీజిల్ రూ.95.58లకు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.101.27, లీటర్ డీజిల్ రూ.96.93 వద్ద నిలిచింది. గత నెల ఐదో తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం నిలిపేసిన కేంద్ర చమురు సంస్థలు తిరిగి గత నెల 24 నుంచి తిరిగి పెంచడం ప్రారంభించాయి.